హైదరాబాద్: 12 మంది మహిళలు 35 మండలాల్లో పర్యటించారు. సమాజంలోని పలు వర్గాల మహిళల సమస్యలను ప్రతిబింబిస్తూ వారికి సాయపడేలా ఓ వేదికను ప్రజారాజ్యం పార్టీకి చెందిన కొందరు మహిళలు తయారుచేశారు.అందులో భాగంగానే గ్రామగ్రామాన మహిళల సమస్యలను తెలుసుకుని ఓ జాబితా రూపొందించారు. ప్రజారాజ్యం ఉమన్స్ డాట్ ఓఆర్జి పేరుతో ఓ వెబ్సైట్ ప్రారంభించి అందులో తాము చేసిన సర్వే ప్రకారం వివరాలన్నీ పొందుపరిచారు. వాటితోపాటు ప్రజారాజ్యం పార్టీ లక్ష్యం తదితర అంశాలు పొందుపరిచారు. ఈ వెబ్సైట్ను ఈరోజు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి లాంఛనంగా ప్రారంభించారు.