వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి
కర్నూలు: కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డకు ఐదు కిలోమీటర్ల దూరంలో గల గూబగుండం వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపో ట్రాక్ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో మరో 8 మంది గాయపడ్డారు.
గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల, కొస్గి ప్రాంతాలకు చెందినవారు. మహబూబ్ నగర్ నుంచి వారు టెంపో ట్రాక్ లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
Comments
Story first published: Thursday, December 11, 2008, 9:52 [IST]