ఇల్లు లేనివారు ఉండొద్దు: సిఎం

YS Rajasekhar Reddy
విశాఖపట్నం: రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్లు ఎవరూ ఉండరాదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అన్నారు. ఈ రోజుల్లో ఎంత చిన్న అద్దె ఇంట్లో ఉండాలన్నా ఆరేడు వందల ఖర్చు తప్పదని ఆయన అన్నారు. రాజీవ్‌ గృహకల్ప పథకంలో మాత్రం నెలకు 500 కడితే సొంత ఇంట్లో ఉండవచ్చని ఆయన అన్నారు. మహిళలకు తమ ప్రభుత్వం ఇస్తున్న కానుకగా ఆయన దీన్ని వర్ణించారు.

విశాఖపట్నంలో రాజీవ్‌ గృహకల్ప సముదాయాన్ని శుక్రవారం ఉదయం ప్రారంభించిన అనంతరం ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా సదస్సులో పాల్గొని మాట్లాడారు. గ్రేటర్‌ విశాఖలో ఇప్పటికే 33 వేల ఇళ్లను నిర్మించామని ఇంకో 33వేల ఇళ్లు కట్టటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని అణగారిన కులాలవారిని వెనుకబడిన కులాల జాబితాలో చేరుస్తామని అన్నారు. దీనివల్ల ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కట్టాల్సిన 36వేల రూపాయల ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. పిల్లలు మంచి చదువుల చదివి మంచి ఉద్యోగాలు పొందగలుగుతారని అన్నారు. వచ్చే ఏడాది ఆగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి కూడా ఈ సౌకర్యం వర్తింపజేస్తామని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+