వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పితృవాదం కేసు: తివారీకి ఊరట
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు వ్యక్తిగతంగా హాజరు కావడం వల్ల ప్రతిష్ట దెబ్బ తింటుందని, అందువల్ల వారు హాజరు కావాల్సిన అవసరం లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలియజేస్తూ ఈ నిబంధనల మేరకు తివారీ మరో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు మినహాయింపు కోరవచ్చని ఈ నిబంధనను పొందుపరుస్తూ మరో పిటీషన్ దాఖలుచేయాలని గవర్నర్కు కోర్టు సూచించింది.
కేసును కొట్టేయాలని తివారీ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు డివిజన్ బెంచ్ తోసిపుచ్చింది. తివారీతో వైవాహికేతర సంబంధంతో తన తల్లి ఉజ్వల సింగ్ కు తాను పుట్టానని, అందువల్ల తనను తివారీ కొడుకుగా అంగీకరించాలని రోహిత్ శేఖర్ అంటున్నాడు. తనను కొడుకుగా అంగీకరించడానికి తివారీ నిరాకరించారని తన కుమారుడు కోర్టుకు వెళ్లాడని, తన కుమారుడికి ఆ హక్కు ఉందని రోహిత్ శేఖర్ తల్లి ఉజ్వల సింగ్ అప్పట్లో అన్నారు.
Story first published: Monday, December 15, 2008, 14:28 [IST]