తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నర్సాపురం లేదా తిరుపతి నుంచి 'చిరు'

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ స్థానం నుండి ఎవరు పోటీ చేయాలన్నదానిపై కసరత్తులు జరుగుతున్నట్లు సమాచారం. ఆ పార్టీ అధినేత చిరంజీవి తిరుపతితో పాటు, సొంత జిల్లాలోని నర్సాపురం నుండి పోటీ చేసే అవకాశం ఉంది. పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న కేవీరావు అనకాపల్లి లోక్‌సభ నుండి టికెట్‌ను ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవలే ప్రజారాజ్యం పార్టీలో చేరిన తోట చంద్రశేఖర్ గుంటూరు లోక్‌సభ నుండి పోటీచేయవచ్చు. పార్టీలో తెలంగాణ వ్యవహారాలు చూస్తున్న కేంద్రమాజీ మంత్రి శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్ ఎల్‌బీనగర్ లేదా సనత్‌నగర్ నుండి పోటీ చేయించడానికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి దంపతులు నంద్యాల లోక్‌సభ, ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానాల నుండి పోటీచేసేది ఖాయమే. కాకపోతే ఎవరు ఎక్కడ పోటీ చేసేది పరిస్థితులను బట్టి ఉండవచ్చు.

కోటగిరి విద్యాదర్‌రావు ఏలూరు లోక్‌సభకు, తమ్మినేని సీతారాం శ్రీకాకుళం లోక్‌సభకు పోటీ చేసే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. చిరు పార్టీ పెట్టక ముందు నుండే ప్రజల్లోకి వెళ్లిన చిరు సోదరుడు నాగబాబు చోడవరం నుండి బరిలోకి దిగే అవకాశం ఉంది. వంగగీత తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నుండి పోటీ చేయవచ్చు. యువరాజ్యం బాధ్యతలు అప్పగించిన చిరంజీవి మరో సోదరుడు రంగారెడ్డి మహేశ్వరం నుండి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా మరికొన్ని రోజులు ఆగితేగానీ ఎవరు ఎక్కడి నుండి పోటీ చేసేది తెలియదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X