వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమ్ముకొస్తున్న యుద్దమేఘాలు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాక్ తో భారత్ యుద్ధం తప్పేటట్లు కనపడటం లేదు.ముంబై పేలుళ్ల నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఏర్పడ్డ ఉద్రిక్త వాతావరణం మరింత వేడెక్కుతోంది.పాకిస్థాన్‌పై యుద్ధానికి దిగేది లేదని నిన్న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన ప్రకటనతో కూడా ఆ దేశం సంతృప్తి చెందడం లేదు. యుద్ధ సన్నాహాలను మరింత ముమ్మరం చేస్తోంది. కాశ్మీర్‌ వద్ద వాస్తవాధీన రేఖ పొడవునా పాకిస్థాన్‌ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరించింది. లాహోర్‌ సెక్టార్‌ వద్దకు సైనిక బలగాలను తరలించినట్లు ఆ దేశ సైనికాధికారులు అంగీకరించారని ఓ వార్తాపత్రిక తెలిపింది. అలాగే ఆ దేశపు వైమానికదళం కూడా హైఅలర్ట్‌లో ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

యుద్ధోన్మాదంతో పాక్‌ ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నం కావడంతో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వెనువెంటనే త్రివిధ దళాధిపతులు, జాతీయ భద్రత సలహాదారుతో అత్యవసరంగా మన్మోహన్‌ భేటీ అయ్యారు. దీనితో యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.ఉగ్రవాదుల ముంబై ముట్టడి నిందితులు తమ దేశం వారు కాదని పాక్‌ చెబుతున్న బరితెగి ంపు అబద్ధాలు అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెర పరచడం తెలిసిందే. పైగా భారత్‌పై మా నసిక యుద్ధం ప్రారంభించి పాక్‌, నియంతృత్వ సామ్రాజ్యవాద పోకడలను తెరపైకి తెచ్చిం ది. దీనితో ప్రధాని అత్యవసరంగా సరిహద్దు పరిస్థితిపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X