వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమ్ముడు కరెక్టే..చిరు మద్దుతు

By Staff
|
Google Oneindia TeluguNews

chiru-pavan
హైదరాబాద్: కాంగ్రెస్‌ నేతలపై పవన్‌ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను పీఆర్పీ పార్టీ అధినేత చిరంజీవి సమర్ధించారు. కాంగ్రెస్‌ వారు మరో వేదికపై తమ నిరసన వ్యక్తం చేసుకోకుండా ఇలా దాడికి దిగడం సరికాదని ఆయన అన్నారు. ఎవరికైనా వాక్‌స్వాతంత్య్రం ఉంటుందన్నారు. గతంలో కాంగ్రెస్‌ నేతలు పలువురు తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని, టీఆర్‌ఎస్‌ వాళ్లు కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.

అంత మాత్రాన తానేమీ మనుషుల్ని పంపి వారిపై దాడి చేయించలేదని చెప్పారు. అది నిజమైన రాజకీయ పార్టీ లక్షణం కాదన్నారు. తమ కార్యాలయం వద్దకు వచ్చి యువజన కాంగ్రెస్‌ నేతలు దాడికి దిగడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ చర్యను ఖండిస్తున్నట్టు తెలిపారు. పవన్‌ వ్యాఖ్యలు కఠినంగా ఉన్నాయన్న విషయాన్ని ప్రస్తావించగా... స్వభావరీత్యా తాను ఏ విషయంపైనైనా సున్నితంగా స్పందిస్తానని, కనుక పార్టీలోనివారంతా సున్నితంగానే స్పందించాలనేమీ లేదన్నారు.సంఘటన అనంతరం ఆయన మీడియాతో పై విధంగా స్పందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X