హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు రక్తం అమ్మకం ఆధారమిదే:తులసి రెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్:తెల్ల కార్డున్న పేదలు సైతం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో డబ్బులు చెల్లించాల్సిందేనని పీసీసీ ఆరోపించింది.అందుకు తగిన ఆధారాలను పీసీసీ అధికార ప్రతినిధి ఎన్.తులసి రెడ్డి గురువారం మీడియాకు విడుదల చేసారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం మల్లారం గ్రామానికి చెందిన ఎం.విజయ్ కుమార్(14) కేన్సర్ తో రెండేళ్ళ క్రితం హైదరాబాద్ లోని ఇండో అమెరికన్ ఆసుపత్రిలో చేరాడు. రక్తం అవసరమని వైద్యలు చెప్పడంతో విజయ్ కుమార్ కి ఏం చేయాలో పాలుపోలేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో పేదలకు ఉచితంగా రక్తం ఇస్తారని చెప్పడంతో ఆశతో అక్కడికి వెళ్ళాడు.

తన దగ్గరున్న తెల్ల కార్డుని చూపి రక్తం ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే డబ్బులు ఇవ్వనిదే రక్తం ఇచ్చేది లేదని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది ఖరాఖండిగా చెప్పటంతో విజయ్ కుమార్ నివ్వెరపోయారు. చివరకు చేసేదేమీ లేక రూ.375 రూపాయలు చెల్లించి రక్తం తీసుకున్నారు. ఆ డబ్బుకు రశీదు తీసుకున్నాడని తులిసిరెడ్డి పేర్కొన్నాడు. డబ్బులు తీసుకుని రక్తం సరఫరా చేసినట్లు కాంగ్రేస్ చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపాలంటూ సవాలు విసిరిన ప్రజారాజ్యం నాయుకుడు కోటగిరి విధ్యాధరరావు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. అలాగే అనవసరమైన ఆరోపణలు చేయాల్సిన ఖర్మ కాంగ్రేసుకి పట్టలేదని స్పష్టం చేసారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X