కాంగ్రెస్ తో చచ్చినా కలవం : కెసీఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: కాంగ్రెస్ తో కలిసేది లేదని, తెలుగుదేశం మహా కూటమిలోనే చేరుతామని టీఅర్ ఎస్ అధినాయకుడు కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆయన చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలుసుకుని మద్దతు ప్రకటించారు. ఈ నెల 21న మహాకూటమి ఏర్పాటును అధికారికంగా ప్రకటించ నున్నట్లు కెసిఆర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ ఓటమికి అది మహాప్రస్థానమని ఆయన వ్యాఖ్యానించారు. వైఎస్‌ దురహంకారాన్ని, అహంభావాన్ని అణగదొక్కేందుకు మహాకూటమి కలిసి పోరాడబోతోందని కెసిఆర్‌ స్పష్టం చేశారు.

చంద్రబాబు నివాసంలో మహాకూటమి నేతల సమావేశానంతరం కెసిఆర్‌ విలేఖర్లతో మాట్లా డుతూ, మహాకూటమి ఏర్పాటుకు ముహూర్తం ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీతో చర్చకు తాను వారిని ఆహ్వానించినట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళడమే తమ అంతిమ నిర్ణయమని కెసిఆర్‌ కుండబద్దలు కొట్టారు.

వోక్స్‌వ్యాగన్‌ నుంచి సత్యం వరకూ బయటపడుతున్న కుంభకోణాల పరంపరకు అడ్డుకట్ట వే సేందుకు, ఆకలి చావుల నుంచి ప్రజలను కాపాడి, వైఎస్‌ వెకిలి నవ్వులకు చరమగీతం పాడేందుకు మహాకూటమి తుది రూపు సంతరించుకున్నదని కెసిఆర్‌ చెప్పారు. ప్రతిపక్షాలకు బుద్ధిలేదని వైఎస్‌ చేసిన వ్యాఖ్యలపై కెసిఆర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+