ఎన్టీఆర్‌ వర్ధంతిలోగా కాదు..

Chandrababu Naidu
హైదరాబాద్: ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ..వచ్చే ఏడాది ఎన్టీఆర్‌ వర్థంతిలోగా టీడీపీని అధికారంలోకి తేవడమే ఎన్టీఆర్‌కు ఇచ్చే నివాళి అని తెలుగుదేశంఅధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అయితే వెంటనే సభాధ్యక్షుడు విజయరామారావు చిన్న సవరణ చేస్తూ.. 'వర్థంతి వరకు అవసరం లేదు. మే నెలాఖరున ఎన్టీఆర్‌ జయంతికే టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది' అని అన్నారు. ఇక అదే ప్రసంగంలో చంద్రబాబు వైయస్ పాలనను విమర్శంచారు.

ఎన్టీఆర్‌ వేసిన ఆత్మగౌరవ పునాదులపై తాము అందించిన ఆత్మవిశ్వాసంతో ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నారని ఆయన అన్నారు. అవినీతి,అరాచక పాలనతో వైఎస్‌ అందరికీ తలవంపులు తెచ్చారని విమర్శించారు. ప్రజలను క్షమాపణ కోరకుంటే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు. అనంతరం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో ఎన్టీఆర్‌పై ఏర్పాటు చేసిన చిత్రపటాల ప్రదర్శనను చంద్రబాబు తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నేత్ర వైద్య, రక్త దాన శిబిరాలను సందర్శించారు.అదే సభలో .. తెలుగు మహిళ అధ్యక్షురాలు రోజా మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీని విమర్శించారు. రంగు, రుచి, వాసన లేని కొత్త పార్టీ మహిళలకు ఎలాంటి న్యాయం చేయలేదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+