రోజాకి చిరు కౌంటర్
అలాగే ప్రజల్ని ఎవరూ మోసం చేయలేరని, ప్రజలే న్యాయమూర్తులని వారే తగిన తీర్పు ఇస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వంద రూపాయలకే వంట సరుకు పథకానికి, గ్రామీణులకు సగం ధరకే విద్యుత్ పథకానికీ మంచి స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లాలో మద్దతు ధర కోసం ఆందోళన చేస్తున్న చెరకు రైతులపై పోలీసులు దాడి చేయడాన్ని, కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
ఇక ఉత్తరాంధ్రలో ప్రజారాజ్యానికి లభిస్తున్న ఆదరణ పాలపొంగు వంటిదన్నారు. మరోసారి చిరంజీవి అక్కడికి వెళితే జనం రారన్నారు. కానీ రాజాంలోనూ, ఇక్కడా జనం నీరాజనాలు పలికారు. అవాకులు చవాకులు మాట్లాడుతున్న వాళ్లు ఒకసారి ఇక్కడకు వచ్చి చూసి మాట్లాడితే మంచిది. ఇది పాలపొంగు కాదని, సునామీ అని అర్థమవుతుంది' అని పేర్కొన్నారు. తమ పార్టీ మత్స్యకారులు, యువశక్తి, మహిళా శక్తి, చేనేత కార్మికులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు... ఇలా అన్ని వర్గాలతో కలసి ఏర్పడిన మెగా కూటమి తమదని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఒంటరి ఎలా అవుతుందని ప్రశ్నించారు.