హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్ ని కలవాలంటూ ఆందోళన

By Staff
|
Google Oneindia TeluguNews

Pawan Kalyan
హైదరాబాద్: పార్టీలో పదివేల మంది యువకులను కార్యకర్తలుగా చేర్పించినా పవన్‌ కళ్యాణ్‌ తనకు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదని భువనగిరికి చెందిన రాజశేఖర్‌రెడ్డి అనే నాయకుడు ఆరోపించాడు. తన అనుచరులతో కలిసి పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అల్లు అరవింద్‌ జోక్యం చేసుకుని అతనిని పవన్‌ దగ్గరకు తీసుకెళ్ళి అపాయింట్ మెంట్ కల్పించారు.వివిధ జిల్లాల ప్రజారాజ్యం కన్వీనర్లు, జాయింట్‌ కన్వీనర్లతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ విద్యార్థులు వచ్చే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ పిలుపునిచ్చారు. ఓటు గనుక వేయకపోతే ప్రశ్నించే హక్కును సైతం కోల్పోతారని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో యువత పాత్ర చాలా తక్కువగా ఉన్నందున, ఇకపై వారు చొరవ తీసుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అలాగే 90 శాతం యువత ప్రజారాజ్యం వెంటే ఉన్నదని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో దోపిడీని, అన్యాయాన్ని పారదోలే శక్తి యువతకు మాత్రమే ఉందన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X