వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై డిఎస్ ఇంకా ఆశాభావం

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణా విషయంలో పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉందని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ అన్నారు. తెలంగాణాపై నిర్ణయం ఓ పద్ధతి ప్రకారం జరుగుతుందని, అందుకే సమయం పడుతుందని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎంత సమయం పడుతుందని అడగగా గడువు చెప్పలేమని ఆయన అన్నారు.

అధిష్టానం తీసుకునే నిర్ణయం తెలంగాణా అభిమానులను సంతోషపరిచేదిగానే ఉంటుందని డి శ్రీనివాస్ అన్నారు. ఈలోగా ఎన్నికలు సమీపంలో ఉన్నాయి కదా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ తెలంగాణాకు, ఎన్నికలకు సంబంధం ఉందని తాను అనుకోవటం లేదన్నారు. ప్రజలకు తాము ఆ విషయాన్ని వివరిస్తామని అన్నారు. ప్రత్యేక తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ కు, పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ కు మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X