హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరుకు మహిళల ముద్దులు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేథ చిరంజీవి తమ పార్టీ మహిళారాజ్యం విభాగం 17 జిల్లాల కమిటీల సభ్యులతో రావినారాయణరెడ్డి ఆడిటోరియంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయా జిల్లాల నుంచి తరలివచ్చిన మహిళలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రరాజ్యానికి అండగా నిలుస్తామంటూ ఉద్వేగంగా మాట్లాడారు. మధ్యలో విద్యుత్తు అంతరాయంతో చిరంజీవి తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపేశారు. అనంతరం చిరంజీవితో ఫొటోలు దిగేందుకు మహిళలు వేదికమీదకి ఒక్కసారిగా దూసుకువచ్చారు. గంటసేపు ఆయన్ను చుట్టుముట్టేశారు. ఇద్దరు మహిళలు చిరంజీవిని ముద్దుపెట్టుకున్నారు. చిరంజీవితో కరచాలనం చేసేందుకు, ఆయన ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఎగబడ్డారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...కాంగ్రెస్‌ పాలనలో గర్భిణులు శ్మశానంలోనూ బాత్‌ రూముల్లోనూ ప్రసవించాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి పంచలో ప్రసవించాల్సిన దౌర్భాగ్యస్థితి నెలకొందని ధ్వజమెత్తారు. 'ఇదేనా ప్రభుత్వ పనితీరు' అని ప్రశ్నించారు.ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం ఎందుకని నిలదీశారు.

వసతి గృహాల్లో బాలికలకు సబ్బులు, కొబ్బరినూనె వంటివి కూడా అందించడం లేదని, అధినేతల దృష్టంతా కమీషన్లు వచ్చే పెద్ద పెద్ద ప్రాజెక్టులపై ఉంది తప్ప పెద్దగా గిట్టుబాటు కాని ఇలాంటి సౌకర్యాల కల్పనపై లేదని ఎద్దేవా చేశారు. ముస్లిం పాఠశాలల్లో పిల్లలంతా చుట్టూ దడిగా నిలబడితే మూత్ర విసర్జనకు వెళ్లాల్సిన దుర్గతి నెలకొందని ఓ ఉర్దూ పత్రిక ఎడిటర్‌ చెబితే ఆశ్చర్యపోయానన్నారు. 11 మంది గిరిజన మహిళలపై అత్యాచారం జరగడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X