మైటాస్ పనులు ఆగవు: సిఎం
హైదరాబాద్: మైటాస్ కంపెనీకి ఉన్న సామర్థ్యం మేరకే తాము అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆ సంస్థకు అప్పగించామని ఇప్పుడు అవన్నీ రద్దు చేస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయని, నష్టపోయేది ప్రజలేనని సీఎం అన్నారు. సత్యం, మైటాస్ కంపెనీలపై శాసనసభలో జరిగిన చర్చకు ఆయన మంగళవారం సమాధానమిచ్చారు. మైటాస్తో తాము కుమ్మక్కు కాలేదని కేవలం ప్రాజెక్టులు ఆగకూడదనే ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. నెల్లూరు పోర్టు పనులు మైటాస్కు ఇవ్వలేదని, మహారాష్ట్ర కంపెనీకి ఇచ్చామని అన్నారు. తెలిసీ తెలియకుండా ఆరోపణలు చేయటం తగదని అన్నారు.
కడపలో కూడా ప్రజలకు నీటి సౌకర్యం కల్పించేందుకు, త్వరగా పనులు జరిగేందుకు పెద్ద కంపెనీ అయిన, గతంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. సత్యం కంపెనీపై 2002లోనే ఓ దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేసిందని అయినా టీడీపీ హయాంలో కావాలనే ఆ నివేదికను తొక్కిపెట్టారని అన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్టుపై తాము పారదర్శకంగా వ్యవహరించామని ఆయన చెప్పారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పుడూ ఒక్క రీతిలో ఉండదనే విషయంలో మాత్రమే శ్రీధరన్ తమతో విభేదించారని ఆయన అన్నారు. మేటాస్ కు ఇచ్చిన సాగనీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు ఉండవని, తాము అందుకు సంబంధించి అన్ని జాగ్రత్తలూ తీసుకున్నామని ఆయన చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడటం తగదని ఆయన చంద్రబాబుకు హితవు చెప్పారు.
-
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ..












Click it and Unblock the Notifications