హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పై ఫిర్యాదుకు ఢిల్లీకి బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్‌మోహన్‌ రెడ్డి కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులు అక్రమ మార్గంలో రావడాన్ని రాజ్యాంగ అధిపతుల దృష్టికి తెచ్చేందుకు తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు చంద్రబాబు రెండు రోజుల ఢిల్లీ పర్యటన తలపెట్టారు. మహా కూటమిలోని టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ముఖ్య నేతలు కూడా ఈ యాత్రలో పాల్గొంటున్నారు. బుధ, గురువారాల్లో మహాకూటమి నేతలు రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతి, కంపెనీ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులకు ఫిర్యాదు చేయనున్నారు.

కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మళ్లించడం, ఎఫ్‌డీఐ పరిమితికి మించి మీడియా రంగంలో విదేశీ నిధులను పెట్టుబడులుగా పెట్టడం వంటివి కేంద్ర ప్రభుత్వ చట్టాల ఉల్లంఘనేనని ఆరోపిస్తూ దీనిపై తక్షణం చర్య తీసుకోవాలని వారు కోరనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఒక సదస్సు కూడా నిర్వహించి వైఎస్‌ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను, ముఖ్యమంత్రి తనయుడి కంపెనీల వ్యవహారాలను ఎత్తి చూపాలని కూడా ఈ పార్టీలు భావిస్తున్నాయి. అనంతరం ముంబై వెళ్లి ఆర్‌బీఐ గవర్నర్‌కు, సెబీ చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X