జగన్ పై ఫిర్యాదుకు ఢిల్లీకి బాబు
కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మళ్లించడం, ఎఫ్డీఐ పరిమితికి మించి మీడియా రంగంలో విదేశీ నిధులను పెట్టుబడులుగా పెట్టడం వంటివి కేంద్ర ప్రభుత్వ చట్టాల ఉల్లంఘనేనని ఆరోపిస్తూ దీనిపై తక్షణం చర్య తీసుకోవాలని వారు కోరనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఒక సదస్సు కూడా నిర్వహించి వైఎస్ ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను, ముఖ్యమంత్రి తనయుడి కంపెనీల వ్యవహారాలను ఎత్తి చూపాలని కూడా ఈ పార్టీలు భావిస్తున్నాయి. అనంతరం ముంబై వెళ్లి ఆర్బీఐ గవర్నర్కు, సెబీ చైర్మన్కు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.
Comments
Story first published: Monday, February 16, 2009, 15:02 [IST]