చంద్రబాబు లేఖపై గొడవ
రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆనం రాంనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగులను అవమానించే విధంగా చంద్రాబాబు వ్యవహరించారని ఆయన అన్నారు. ఉద్యోగుల ఆత్మస్థయిర్యాన్ని చంద్రబాబు దెబ్బ తీయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. పార్టీలకు అతీతంగా పనిచేసే తమపై ప్రతిపక్షనేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు విచారకరమని ప్రకాశం జిల్లా కలెక్టర్ దేవానంద్ అన్నారు. తమపై నమ్మకం లేదని చంద్రబాబు అన్నారని, ఎన్నికల కోడ్ వస్తే తాము ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనిచేస్తామని, అధికారపక్షంతో ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన అన్నారు.
Comments
Story first published: Tuesday, February 17, 2009, 16:45 [IST]