సత్యంపై పార్లమెంటులో దుమారం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లోనూ సత్యం కంప్యూటర్స్ వ్యవహారంపై మంగళవారం దుమారం చెలరేగింది. సత్యం, మైటాస్, జగతి పబ్లికేషన్స్పై చర్చించాలని ఉభయసభల్లో మహాకూటమి సభ్యులు కోరారు. లోక్సభలో దీనిపై చర్చకు మహాకూటమి పట్టుబట్టింది. దీనిపై అకస్మాత్తుగా చర్చ కుదరదని, అయితే మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే చర్చకు తాను అనుమతి ఇస్తానని స్పీకర్ సోమనాథ్ చటర్జీ అన్నారు.
రాజ్యసభలో ఈ విషయాన్ని టీడీపీ సభ్యుడు మైసూరారెడ్డి లేవనెత్తారు. దీనిపై తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతోందని మూడు నెలల్లో నివేదిక ఇస్తుందని కంపెనీ వ్యవహారాల మంత్రి పిసిగుప్తా సమాధానం ఇచ్చారు. సత్యం వ్యవహారంలో ప్రభుత్వం నిందితులను కాపాడడానికి ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సత్యం వ్యవహారంపై దర్యాప్తు సంస్థలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని మంత్రి చెప్పారు. సత్యం కుంభకోణం అత్యంత దురదృష్టకరమైందని, దానిపై దర్యాప్తు సాగుతోందని ఆయన అన్నారు. ప్రైస్ వాటర్ కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టే అధికారం రిజర్వ్ బ్యాంక్ కు లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సత్యం కుంభకోణంపై పార్లమెంటరీ ప్యానెల్ విచారణకు ఆదేశించాలని మైసురా రెడ్డి కోరారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
ఇక అమెరికా చేతుల్లోకి హార్మూజ్ జలసంధి: ట్రంప్ సంచలనం -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
33 వేలతో సినిమా.. బాహుబలి రేంజ్ విజువల్స్.. ట్రైలర్ చూస్తే పిచ్చోళ్లవుతారు..!!












Click it and Unblock the Notifications