వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఢిల్లీలో జగన్ పై ఫిర్యాదులు

By Staff
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: సత్యం వ్యవహారంపై, ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జగతి పబ్లికేషన్అక్రమాలపై ఢిల్లీలో పోరు సాగించేందుకు మహాకూటమి నేతలు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై జాతీయస్థాయిలో తమ వాణిని వినిపించేందుకు రెండురోజుల పర్యటనకుగాను సుమారు 51మంది శంషాబాద్‌ విమానాశ్రయంనుంచి బయలుదేరివెళ్లారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీపీఐ కార్యదర్శి నారాయణ తదితరులు ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో మొదటగా వారు రాజ్‌ఘాట్‌ వెళ్లి మహాత్మునికి నివాళులు అర్పించారు. బుధవారం సాయంత్రం కంపెనీ వ్యవహారాల మంత్రి పీ.సీ.గుప్తాతో సమావేశం అవుతారు. సత్యం, మైటాస్‌ కంపెనీల గురించి జగతి పబ్లికేషన్స్‌లో అక్రమాల గురించి వారు ఆయనకు వివరిస్తారు. రేపు పార్లమెంట్‌ హాల్లో ఇదే విషయాలపై చర్య కోరుతూ ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం ఇస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X