ఈ దొంగల రాజ్యం మారాలి: పవన్
మహాకూటమిలో ప్రతిసారి చేతులు పైకెత్తి నిలబడే ఆ నలుగురు తప్ప ఎవరూ లేరని ఎద్దేవా చేశారు. ప్రపంచ బ్యాంకు ఏజెంటు అంటూ చంద్రబాబును తిట్టిన రాఘవులు, టూరిజం తప్ప కమ్యూనిజం లేదన్న చంద్రబాబు, లేచిందే మొదలు తిట్టిపోసుకునే కేసీఆర్లు మహాకూటమిగా ఏర్పడి ప్రజల్ని మోసం చేశారని, ఆధికారంలోకి వస్తే మళ్లీ ఒకరికొకరు తిట్టుకుంటూ విడిపోయి మరోమారు ప్రజల్ని మోసం చేస్తారన్నారు.
జలయజ్ఞం పేరుతో సంపాదన యజ్ఞాన్ని చేపట్టారని వైఎస్ ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన ప్రాజెక్టు ఎన్నో ఏళ్లుగా సుస్థిరంగా ఉంటే ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులు ట్రయల్ రన్లోనే తుస్సుమంటున్నాయని ఎద్దేవా చేశారు. రాజకీయంగా ఎదగడం కోసమే రోజా తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారన్నారు.
Comments
Story first published: Thursday, February 26, 2009, 12:10 [IST]