రోడ్డు ప్రమాదంలో 4 గురు మృతి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 4గురు మృతి చెందారు. 20 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. పోలవరం కుడి కాలువలో టిప్పర్ బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. దారినవెళ్లేవారు వెంటనే సహాయ చర్యలు చేపట్టటంతో ఘోర ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేస్తున్నారు.
Comments
Story first published: Monday, March 2, 2009, 11:14 [IST]