వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్ లో లంక పర్యటన రద్దు
లాహోర్: పాక్లో పర్యటిస్తున్న శ్రీలంక క్రికెట్ జట్టుపై ఆగంతకుడు జరిపిన కాల్పుల నుంచి శ్రీలంక క్రికెటర్లు తృటిలో తప్పించుకున్నారు. దీంతో వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారికి స్టేడియంలోనే ప్రథమ చికిత్స చేసి హోటల్కు పంపారు. ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. పాక్లో తమ జట్టు పర్యటనను రద్దు చేస్తున్నట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. మరోవైపు గాయపడిన వారిని పోలీసులను ఆసుపత్రికి తరలించారు. క్రికెటర్లపై నేరుగా ఒక్క వ్యక్తే కాల్పులు జరిపినా వారు మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Story first published: Tuesday, March 3, 2009, 11:22 [IST]