హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైఎస్‌కు కలల్లోనూ నేనే!

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: 'వైఎస్‌కు నిద్రలోనూ, కలలోనే నేనే కనిపిస్తున్నట్లున్నా.. అందుకే నాపై ఎదురుదాడికి దిగుతున్నారు.. దానికి మేం భయపడే ప్రసక్తే లేదు. ఇక వారికి రోజులు.. కాదు.. కాదు.. గంటలు లెక్కపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది' అని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కామెంట్ చేసారు. కేశినేని నాని పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ పై విధంగా విమర్శలు గుప్పించారు.

అలాగే ముఖ్యమంత్రికి ఎన్నికల జ్వరం పట్టుకుంది..ఎన్నికల్లో ఓడిపోతే తన అవినీతి సామ్రాజాన్ని ఎలా కాపాడుకోవాలో అని భయపడుతున్నారు.. వైఎస్‌ హయాంలో వూరికొక అవినీతి పరుడిని తయారు చేయటమే ఆయన చేసిన అభివృద్ధి అంటూ విరుచుకుపడ్డారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కు తీసుకువెళ్లారు. తెలుగువారు తిరిగి తలెత్తుకుని తిరగాలంటే తెదేపా అధికారంలోకి రావాలి. ఏదో ఒకటి రెండు ఛానళ్లలో అసత్యవార్తలు ప్రచారం చేయించుకుంటే సరిపోదు. ఛాలెంజ్‌...ఎన్నికల్లో కాంగ్రెస్‌ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం' అని తెదేపా చంద్రబాబు ఈ సందర్భంగా సవాల్ విసిరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X