మహేష్ బాబు ఎవరు?: రోశయ్య
ఆ తర్వాత మీడియా వారు ప్రిన్స్ మహేష్ బాబు..సినీహీరో కృష్ణ కుమారుడని చెప్పారు..'అవునా..నేనెవరి గురించో అనుకున్నా..మా పార్టీలో మహేష్ ఎవరైనా ఉన్నారేమో..ముఖానికి రంగేసుకున్నారేమోనని సందేహపడ్డాను' అని వివరణ ఇచ్చారు. తనకు నిజంగా మహేష్బాబు తెలియదని రోశయ్య అన్నారు.
ఇక తాము అందుబాటులో ఉన్న సినీనటుల ఇష్టాయిష్టాలను బట్టి ప్రచారం చేయిస్తామని చెప్పారు. దానికి మీడియా వారు...కాంగ్రెస్ నేతలే పెద్ద నటులని..ఇంకా సినీనటులెందుకన్న మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసారు. దానికాయన..'బొత్సా యువకుడు కదా.. ఏదైనా తేలిగ్గా మాట్లాడేస్తాడు' అంటూ ముక్తాయించారు.
ఇంతకీ మహేష్బాబు కాంగ్రేస్ ప్రచారానికి వస్తారో రారో తెల్చలేదు. కానీ రోశయ్య మాటలను బట్టి మహేష్ ఒప్పుకోలేదనే విషయం స్పష్టమవుతోందని అంతా అనుకోవటం జరిగింది. అలాగే నంది అవార్డును తీసుకున్నప్పుడు..కాంగ్రెస్కు మద్దతుగా ఏమైనా మాట్లాడతాడేమోనని ఆశగా ఎదురుచూసిన వర్గాలు..ఏమీ మాట్లాడకపోవడంతో నిరాశకు లోనయిన సంగతి తెలిసిందే.