హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'జూ.ఎన్టీఆర్, అవమానాలు మరిచావా?'

By Staff
|
Google Oneindia TeluguNews

Jr Ntr
హైదరాబాద్‌: నందమూరి వంశంతో ఇప్పుడు వరసలు కలుపుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ను ఆ కుటుంబం వాళ్ళు ఎప్పుడైనా పెళ్ళిళ్ళకు, పెటాకులకు పిలిచారా? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా లేని బంధుత్వం..మళ్లీ అధికారంలోకి వచ్చేందుకే పుట్టుకొచ్చిందా అని నిలదీసింది. సీఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, పీసీసీ అధికార ప్రతినిధి ఎన్‌.తులసిరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మాదాసు గంగాధరం ఆదివారం విలేఖరులతో మాట్లాడారు. "పెళ్లికి పిలిచి అవమానించిన విషయాన్ని విస్మరించారా? ఇప్పటికైనా వారు ఎన్టీఆర్‌ను మనవడిగా అధికారికంగా అంగీకరించారో...లేదో! టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఈ బంధుత్వాన్ని విడిచిపెడతారేమో గ్రహించాలి" అని సూచించారు.

ఆత్మగౌరవం గురించి పదే పదే మాట్లాడుతున్న జూనియర్‌ ఎన్టీఆర్‌కు..నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు గుర్తు లేదా అని నిలదీశారు. ఆయన బతికుండగానే 'ఎన్టీఆర్‌ తెలుగుదేశం' పార్టీని స్థాపించి...జామాతా దశమగ్రహం పేరిట విడుదల చేసిన క్యాసెట్‌లో చేసిన చంద్రబాబుపై చేసిన విమర్శలు విస్మరించారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీపైనా, ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిపైనా అవాకులూ, చవాకులూ పేలితే సహించేది లేదని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X