ఎంపిలో 12 మంది సజీవ దహనం
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో 12 మంది సజీవ దహనమయ్యారు. బందిపోట్లు ఈ దురాగతానికి పాల్పడ్డారు. సజీవదహనమైనవారిలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. ఈ దుర్ఘటన గురువారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా బిచిచియాన్ గ్రామంలో జరిగింది. ఈ గ్రామం భోపాల్ కు 490 కిలోమీటర్ల దూరంలో ఉందని జిల్లా కలెక్టర్ సుఖ్ బీర్ సింగ్ చెప్పారు.












Click it and Unblock the Notifications