హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నెత్తురోడిన రోడ్లు: 17 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం ఉదయం మూడు చోట్ల రోడ్లు నెత్తురోడాయి. రాష్ట్రంలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోతు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది పాఠశాల పిల్లలతో పాటు ఆటో డ్రైవర్ మరణించారు. స్కూలు ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా బీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలా ఉంటే, అనంతపురం జిల్లా గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X