నెత్తురోడిన రోడ్లు: 17 మంది మృతి
హైదరాబాద్: రాష్ట్రంలో గురువారం ఉదయం మూడు చోట్ల రోడ్లు నెత్తురోడాయి. రాష్ట్రంలో జరిగిన మూడు వేర్వేరు ప్రమాదాల్లో 17 మంది మరణించారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోతు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది పాఠశాల పిల్లలతో పాటు ఆటో డ్రైవర్ మరణించారు. స్కూలు ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. సంఘటనా స్థలం వద్ద పరిస్థితి హృదయ విదారకంగా ఉంది.
పశ్చిమ గోదావరి జిల్లా బీమడోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ బోల్తా పడడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇదిలా ఉంటే, అనంతపురం జిల్లా గుత్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ఆటోను లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Comments
Story first published: Thursday, March 19, 2009, 10:44 [IST]