వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక హైకమాండ్ దే జాప్యం: డిఎస్

By Staff
|
Google Oneindia TeluguNews

D Srinivas
న్యూఢిల్లీ: రాష్ట్రంలోని లోకసభ, శాసనసభా స్థానాలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కసరత్తు పూర్తయింది. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డితో కలిసి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ గురువారం ఉదయం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో తమ పని ముగిసిందని, జాబితాను ప్రకటించాల్సింది పార్టీ అధిష్ఠానమేనని శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. జాబితాలో మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అధిష్ఠానం తమను పిలిస్తే తిరిగి ఢిల్లీకి వస్తామని ఆయన చెప్పారు. తాము సోనియాకు చెప్పాల్సిందంతా చెప్పామని, ఇక నిర్ణయం సోనియాదేనని ఆయన అన్నారు. గత కొద్ది రోజులుగా వైయస్, డిఎస్ ఢిల్లీలో మకాం వేసి అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశమై అభ్యర్థుల ఎంపికను పూర్తి చేశారు.

పెన్మెత్స కినుక నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం నుంచి తాను పోటీచేసే ప్రసక్తే లేదని సీనియర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పెన్మత్స సాంబశివరాజు విజయనగరంలో అన్నారు. తాను తొలినుంచి అసెంబ్లీ పోటీకి సిద్ధంగా లేనని, విజయనగరం ఎంపీగా మాత్రమే పోటీ చేస్తానని, ఈ విషయం అనేకసార్లు అధిష్టానానికి చెప్పానని అన్నారు. టీడీపీకి చెందిన గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉదయం కాంగ్రెస్‌లో చేరితే సాయంత్రంకల్లా నల్గొండ ఎంపీ సీటు ఇచ్చారని, 50 ఏళ్లుగా పార్టీకోసం పనిచేసిన తనకు ఇవ్వకపోవటం అన్యాయమని అన్నారు. తనకు ఎంపీ టిక్కెట్‌ ఇవ్వకపోతే ఏం చేసేది రెండురోజుల్లో చెబుతానన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X