హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంగారు 'కొండలం' మేమే: వైయస్

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో బంగారు పతకం తమదేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కాంగ్రెసు ఎన్నికల ప్రచారాన్ని ఆయను శుక్రవారం ఉదయం విజయఢంకా మోగించి ప్రారంభించారు. రజత, కాంస్య పతకాలు ఎవరివో మిగతా పార్టీలు తేల్చుకోవాల్సిందేనని ఆయన అన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో 234కు పైగా శాసనసభా స్థానాలు, 36కు పైగా లోకసభ స్థానాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ఎన్నికల ప్రచారాన్ని ఇక ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు. ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి 170 శాసనసభా నియోజక వర్గాల్లో పర్యటించనున్నారు.

సామాజిక న్యాయం గురించి మరొకరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. బిసిలకు వచ్చే ఎన్నికల్లో 70 సీట్లకు పైగా ఇస్తామని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ పథకాలనే కాపీ కొడుతున్నారని, చంద్రబాబు పద్ధతి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు ఏనాడూ రైతు పక్షపాతి కాలేరని ఆయన అన్నారు. రైతులకు రుణమాఫీ చేశారా, ఉచిత విద్యుత్తు ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X