హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పురంధేశ్వరిపై గంటా: బాబుపై ప్రసాద్

By Staff
|
Google Oneindia TeluguNews

Ghanta Srinivas Rao
హైదరాబాద్: విశాఖపట్నం లోకసభ స్థానంలో కాంగ్రెసు అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై గంటా శ్రీనివాసరావును పోటీకి దించేందుకు చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీ కసరత్తు చేస్తోంది. లోకసభ అభ్యర్థుల ఎంపికలో ప్రజారాజ్యం పార్టీ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తోంది.కాంగ్రెసు టికెట్లు దక్కక తమ పార్టీలో చేరడానికి ముందుకు వచ్చే వారికి టిక్కెట్లు కేటాయించాలని ప్రజారాజ్యం పార్టీ భావిస్తోంది. విజయనగరం లోకసభ సీటును ఆశించి భంగపడి కాంగ్రెసుకు రాజీనామా చేసిన పెన్మత్స సాంబశివరాజును పార్టీలో చేర్చుకుని ఆయన ఆశించిన సీటును కేటాయించాలని ప్రజారాజ్యం పార్టీ భావిస్తోంది.

బిజెపిలో ఉన్న ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణం రాజును నర్సాపురం లోకసభ సీటు నుంచి పోటీకి దించేందుకు సిద్ధపడుతోంది. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజారాజ్యం పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి కళ్యాణిని, మచిలీపట్నం నుంచి ముత్తంశెట్టి విజయనిర్మలను పోటీకి దించే యోచనలో ఉంది. అలాగే అమలాపురం లోకసభ సీటును మాలమహానాడు నేత స్వర్గీయ పివి రావు భార్య ప్రమీలకు కేటాయించే అవకాశం ఉంది.కుప్పం శాసనసభా స్థానంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై ఎంవి ప్రసాద్ ను పోటీకి దించే ఆలోచనలో ఉంది. జనరల్ స్థానాల్లో కొన్నింటిని ఎస్సీలకు కేటాయించాలనే ఆలోచన కూడా ప్రజారాజ్యంలో జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X