వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అసెంబ్లీ బరిలో బ్రహ్మానందం, పోసాని
కాగా, పోసాని కృష్ణమురళి స్వస్థలం పెదకాకాని. నాగార్జున విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో ఆయన విద్యార్థి సంఘాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. మొదటి నుంచీ ఆయన కాంగ్రెసు వ్యతిరేకిగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఆ పార్టీలో చేరారు. ఆయన సినీ రంగంలో ఉంటూనే స్వస్థలంలోని బంధువులు, మిత్రులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ బరిలోకి దిగుతుండడంతో అదే వర్గానికి చెందిన పోసాని కృష్ణమురళిని పోటీకి దించాలని ప్రజారాజ్యం పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Comments
Story first published: Wednesday, March 25, 2009, 14:05 [IST]