మృత దేహాల తరలింపునకు ఏర్పాట్లు
హైదరాబాద్: అమెరికాలోని సెయింట్ లూయిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విద్యార్థుల మృతదేహాలను రాష్ట్రానికి తెప్పించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తానా, సెయింట్ లూయిస్ తెలుగు సంఘం ప్రతినిధులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల మృతదేహాలను విడివిడిగా ప్రత్యేకమైన పేటికల్లో అమర్చారు.
మరణించిన విద్యార్థులకు నివాళులు అర్పించేందుకు ఈస్టర్న్ ఇల్లినాయిస్ యూనివర్శిటీ నుంచి పెద్ద యెత్తున విద్యార్థులు తరలి వచ్చారు. పలు నగరాల నుంచి వచ్చిన తెలుగు సంఘాల ప్రతినిధులు మృతదేహాలపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. తానా కోశాధికారి నన్నపనేని మోహన్, సెయింట్ లూయిస్ తెలుగు సంఘం ప్రతినిధులు వీరమాచినేని త్రిజాకర రావు, బండి ప్రసాద్, సురేన్ పాతూరి తదితరులు ఏర్పాట్లు చూస్తున్నారు.
Comments
Story first published: Thursday, March 26, 2009, 9:24 [IST]