భువనగిరికి నోముల: అరకుకు మిడియం
హైదరాబాద్: సిపిఎం తమ అభ్యర్థుల రెండో జాబితాను సోమవారం విడుదల చేసింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం పార్టీతో సిగపట్లకు దిగిన సిపిఎం చర్చలు కొలిక్కి రాకపోవడంతో ఈ జాబితాను విడుదల చేసింది. శాసనసభా స్థానాలకు పాయం వెంకయ్య (అశ్వారావుపేట), చుక్కా రాములు (పటాన్ చెరు), ఎం.శ్రీనివాస రెడ్డి (కార్వాన్), సిహెచ్ నర్సింగరావు (గాజువాక), భాను రాజు (నెల్లూరు రూరల్) పేర్లను సిపిఎం సోమవారం ఖరారు చేసింది.
భువనగిరి లోకసభ స్థానానికి నోముల నర్సింహయ్య, అరకు లోకసభ స్థానానికి మిడియం బాబూరావు పేర్లను సిపిఎం ప్రకటించింది. తమకు మరిన్ని సీట్లు కేటాయించాలని సిపిఎం తెలుగుదేశం పార్టీతో తగాదాకు దిగుతూ వస్తోంది. సీట్ల సర్దుబాటుపై ఆదివారం రాత్రి కూడా ఇరు పార్టీల మధ్య చర్చలు జరిగాయి. చర్చలు ముగిశాయని తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తుండగా ఇంకా కొలిక్కి రాలేదని సిపిఎం అంటోంది.
More From
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
టీడీపీలో విషాదం, సీనియర్ నేత కన్నుమూత..!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications