గౌహతిలో పేలుడు: నలుగురు మృతి
గౌహతి: అసోంలోని గౌహతి నగరంలో శక్తివంతమైన కారు బాంబు పేలుడు సంభవించి నలుగురు మృతి చెందారు. మరో 20 మంది దాకా గాయపడ్డారు. కారులో పెట్టిన బాంబు సోమవారం మధ్యాహ్నం పేలింది. ఈ పేలుడు జాలుక్ బరీ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పేలుడులో పలు కార్లు దగ్ధమయ్యాయి. ఈ పేలుడుకు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (ఉల్ఫా) తిరుగుబాటుదారులై ఉండవచ్చునని భావిస్తున్నారు. ఉల్ఫా పతాకావిష్కరణ దినం సందర్భంగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. తామే దాడికి పాల్పడ్డామని ఉల్ఫా తెలియజేసింది.












Click it and Unblock the Notifications