బాబు పుత్రుడు లోకేష్ ప్రచారం

ఎన్నికల ప్రణాళికలో తెలుగుదేశం ఇచ్చిన హామీలను ఆయన వివరించారు. పేద కుటుంబాలకు అమలు చేయనున్న అయిదు రకాల పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు యత్నించారు. పేదలకు నగదు బదిలీ పథకం, ఎన్టీఆర్ ఆరోగ్య పథకం, ఉచితంగా కలర్ టీవీలు, రైతులకు గిట్టుబాటు ధరల కోసం ప్రత్యేక ప్యాకేజీ, యువత అభ్యున్నతికోసం 'ఎస్' (యూత్ ఎన్ పవర్ మెంట్ స్కీం) అనే సంక్షేమ పథకాలను ఏవిధంగా అమలు చేస్తామన్న విషయాలను ప్రజలకు సవివరంగా తెలియజెప్పారు. విదేశాల్లో విజయవంతంగా అమలవుతున్న నగదు బదిలీ పథకం మన రాష్ట్రంలోనూ అమలు చేస్తామని వెల్లడించారు. పథకాలను మాటల్లోనే కాదని, చేతల్లో కూడా చేసి చూపెడతామని లోకేష్ పలుచోట్ల స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ పాలనలోని అవినీతిని, జలయజ్ఞంలో అక్రమాలను లోకేష్ ప్రసంగంలో ఎత్తిచూపారు.












Click it and Unblock the Notifications