వైయస్ కీలుబొమ్మ సోనియా: కెసిఆర్

K Chandrasekhar Rao
వరంగల్: తెలంగాణ అంశాన్ని ఐదేళ్ల్గు నానబెట్టిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కరీంనగర్ లో చావు కబురు చల్లగా చెప్పారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు వ్యాఖ్యానించారు. ఐదేళ్లుగా తెలంగాణను కోరుతుంటే ఇవ్వలేదని, సోనియా ముఖ్యమంత్రి చేతిలో కీలుబొమ్మగా మారారని ఆయన అన్నారు. తెలంగాణకు అన్నిరకాల అడ్డంకిగా మారిన వెయ్యి తలల విషసర్పం కాంగ్రెస్‌ పార్టీని ఈ ఎన్నికల్లో పది కిలోమీటర్ల లోతున బొంద పెట్టాలని తెరాస అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా హుస్నాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌ జిల్లా జనగామల్లో జరిగిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. 38 జాతీయ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నా స్పందించని సోనియా మళ్లీ ఇదే అంశంపై మాట్లాడడం విచిత్రంగా ఉందన్నారు. సోనియా మాటల్ని ఇక్కడి ప్రజలు నమ్మేస్థితిలో లేరని స్పష్టంచేశారు.

తెలంగాణ కోసం ఢిల్లీలో అందరి చుట్టూ తిరుగుతుంటే ఎగతాళి చేశారన్నారు. 1956లో తెలంగాణను ఊడగొట్టిందీ కాంగ్రెస్సే, ఇప్పుడు తెలంగాణ రాకుండా అడ్డుపడుతోందీ కాంగ్రెస్సే అని విమర్శించారు. కాంగ్రెస్‌ తెలంగాణ పాలిట శాపమని, తెలంగాణలో జరిగే అన్యాయానికి, దాష్టీకానికి కాంగ్రెసే కారణమని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌పోతేనే తెలంగాణ వస్తుందన్నారు.అధికారంలోకి వచ్చేది మహాకూటమియేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల్లో అన్నింటికన్నా తనకు నచ్చినది నగదు బదిలీ పథకమని చెప్పారు. ఈ పథకంలో మధ్య దళారీలు, పైరవీకారులకు అవకాశం లేకుండా చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.25 వేల లోపు రుణాలను మాఫీ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+