బాబును చూస్తే అసహ్యం: చిరు

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెసు వారు సంపాదించుకున్నారని ఆయన ఆరోపించారు. తమకు ప్రజలు అధికారం ఇచ్చే చారిత్రాకావకాశం వచ్చిందని, ప్రజలు దాన్ని వృధా చేసుకోరని ఆయన అన్నారు. తమపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. పార్టీకి బలం, శక్తినిచ్చే వారితో మాట్లాడుతామని, తాను ఒక్కడినే నిర్ణయం తీసుకోబోనని ఆయన చెప్పారు. తనకు మద్దతిచ్చే వారంతా తన శక్తులేనని ఆయన అన్నారు. తమ పార్టీలో జరిగే వ్యవహారాలను ఎక్కువ చేసి చూపుతున్నారని ఆయన అన్నారు.ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చాక తనను చూస్తారని, తాను ఏం మాట్లాడుతున్నానో చూస్తారని, ప్రజలకు తామే కనిపిస్తున్నామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications