సినీ పార్టీని నమ్మొద్దు: సిఎం

YS Rajasekhar Reddy
విజయవాడ: ఎన్టీఆర్ హయాంలోని పథకాలనే ఎత్తేసిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చే వాగ్దానాలను ప్రజలు విశ్వసించబోరని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరంలో ఆయన మంగళవారం ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గత 9 ఏళ్ల తెలుగుదేశం పాలనలో అమలు చేసిన కార్యక్రమాలను, తాము గత ఐదేళ్లలో అమలు చేసిన పథకాలను బేరీజు వేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. మహా కూటములు, మెగా కూటములు పుట్టుకొచ్చాయని, అవేవీ తమ విజయాన్ని అడ్డుకోలేవని ఆయన అన్నారు. తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. తాము రైతుల రుణాలు మాఫీ చేశామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్నామని ఆయన చెప్పుకున్నారు. తాము అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు.

ప్రజలకు ఏం కావాలో వారు పడుతున్న ఇబ్బందులేమిటో తాము మాత్రమే గ్రహించగలమని అందుకే సామాన్యులకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. తాము మడమ తిప్పకుండా అభివృద్ధి సాధించామని ఆయన అన్నారు. ప్రాజెక్టులెన్నో ప్రారంభించామని వాటిని పూర్తి చేయగల సత్తా తమకే ఉందని ఆయన అన్నారు. మహిళలు, రైతులకు ఎన్నో పథకాలు అమలుచేశామని, గుడిసెల్లేని ఆంధ్రప్రదేశ్‌ను తాము మాత్రమే సాధ్యం చేశామని అన్నారు. గన్నవరానికి ఎన్నో పనులు చేశామని ఆయన గుర్తు చేశారు. రాజకీయం అంటే తెలియని సినిమా పార్టీని నమ్మవద్దని కోరారు. అభయహస్తాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+