అధికారం మాదే: రాహుల్ ధీమా

తమ పార్టీని గెలిపించినప్పుడే రాష్ట్రంలో గానీ, దేశంలో గానీ పేదల జీవితాలు బాగుపడతాయని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను రాష్ట్రాలు సక్రమంగా వినియోగించినప్పుడు పేదలకు మేలు జరుగుతుందని, అలా జరగడం వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించిందని, పేదలకు మేలు జరిగిందని ఆయన చెప్పారు. ఒరిస్సాలో కేంద్ర ప్రభుత్వ నిధులను సక్రమంగా వినియోగించడం లేదని, ఆ రాష్ట్ర ప్రభుత్వానికి పేదల పట్ల చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు రూపాయల కిలో బియ్యం పథకం, ఆరోగ్య శ్రీ వంటి పథకాలు పేదలకు ఎంతో మేలు చేస్తున్నాయని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications