రామ్ చరణ్ కేం తెలుసు: అల్లు

తొలివిడత జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో త్రిముఖ పోరు జరిగిందని ఆయన అన్నారు. ఉత్తర కోస్తా మూడు జిలాల్లో తమ పార్టీకి ఎదురే లేదని చెప్పారు. తెలంగాణలో తెరాస, వామపక్షాల కవచాన్ని అడ్డం పెట్టుకున్న తెలుగుదేశం గొప్పగా యుద్ధం చేశామని అనుకుంటోందని ఆయన అన్నారు. అందుకే ఇంచుమించు ఓట్లన్నీ తమకే పడ్డాయని, అధిక స్థానాలు గెలుస్తున్నామని ప్రగల్భాలు పలుకుతోందని విమర్శించారు. తెరాస, వామపక్ష కవచాల ప్రభావం లేని మలియుద్ధం ముందుందని ప్రకటించారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి కనీసం యుద్ధం చేసే అవకాశం కూడా లేదని వ్యాఖ్యానించారు. రెండో విడత ఎన్నికలైన తర్వాతే ఎన్నిసీట్లు వస్తాయనేది మాట్లాడతానని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
పాలకొల్లు ప్రజలు చిరంజీవిని పెద్ద కొడుకుగా చూసుకుంటారని అరవింద్ విశ్వాసం వ్యక్తం చేశారు. అల్లుడికి కేవలం భోజనం పెట్టి పంపించండంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అరవింద్ స్పందించారు. తిన్న తర్వాత వెన్నుపోటు పొడిచి వెళ్లాల్సిన అవసరం చిరంజీవికి లేదంటూ పరోక్షంగా బాబును ఎద్దేవా చేశారు. భోజనం పెట్టడమే కాకుండా ఊళ్లో ఉన్న 90 శాతం ఓట్లు తమ అల్లుడికే వేస్తారన్నారు. తిరుపతి, పాలకొల్లుల్లో ఏ స్థానాన్ని వదులుకోవాలనే విషయమై కనీసం ఆలోచన కూడా చేయలేదని చెప్పారు. చిరంజీవి తిరుపతిని వదులుకుంటారంటూ అక్కడ, పాలకొల్లును వదులుకుంటారంటూ ఇక్కడ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశం లేదని, ప్రజారాజ్యం పార్టీకి పూర్తి మెజారిటీ వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యంపై కాపు సంఘాల విమర్శలను విలేకరులు ప్రస్తావించగా, కాపులను దరి చేరనివ్వట్లేదని కొందరు, ఇది కాపుల పార్టీ అని మరికొందరు వ్యాఖ్యానించారని, తామేంటన్నది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు. చిరంజీవిని పార్టీ పెట్టమని ఎవరైనా బొట్టుపెట్టి పిలిచారా? అంటూ జూనియర్ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అనకాపల్లి ప్రజలు ఇష్టపడుతున్నారని అక్కడ తిరిగినప్పుడు అనిపించిందని, అందుకే అక్కడ ఎంచుకున్నానని తెలిపారు. పరకాల ప్రభాకర్ ఆరోపణలు ముగిసిన అధ్యాయమని చెప్పారు. చిరంజీవి చిన్న కూతుర్ని, అల్లుడిని ఎన్నికల ప్రచారానికి పిలవలేదని తెలిపారు.
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే












Click it and Unblock the Notifications