తెలంగాణ: వైయస్ పై కాకా

వైఎస్ తలచుకుంటే రేపే తెలంగాణ వస్తుందని ఏడాదిగా నేను చెబుతూనే ఉన్నానని, తెలంగాణ వస్తే కష్టాలు పాలవుతామని రానివ్వలేదని ఆయన అన్నారు. పార్టీ ఒప్పుకొన్న తర్వాత, కోర్ కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా తెలంగాణ అంశాన్ని ఇక్కడ దాకా లాక్కొచ్చారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఏదో ఆశలో ఉన్నారని, వారినిప్పుడు మొత్తానికే ముంచేసినట్లయిందని ఆయన అన్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ఆయన చేసింది కాదని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాతపూర్వకంగా ఇచ్చి మాట్లాడాలని చెప్పారని వెంకటస్వామి అన్నారు. అధిష్టానం రాసిచ్చింది సీఎం చదివారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications