బాబు స్కీంపై పురంధేశ్వరి ఫిర్యాదు

బ్రెజిల్లో ఈ పథకాన్ని ప్రపంచబ్యాంకు ప్రారంభించిందని గుర్తు చేశారు. పిల్లలను బడికి పంపడం, పిల్లలకు అంటువ్యాధులు రాకుండా సమయానికి టీకాలు వేయించడం తదితర నిబంధనలతో ఈ పథకాన్ని పెట్టారని తెలిపారు. ఇప్పటికే భారత్ లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలను బడికిపంపే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏడాది ఆదాయం 78 వేల కోట్లు ఉంటే, ఈ పథకాన్ని అమలు చేయడానికి రూ.36 వేల కోట్లు ఖర్చవుతుందని వివరించారు. తెలుగుదేశం చెబుతున్నట్లుగా అయినా 18 వేల కోట్లు భారీ మొత్తమని అన్నారు. ఎలా సాధ్యమో తెలుగుదేశాన్ని వివరణ అడగాలని, దాన్నిబట్టి ప్రజా ప్రాతినిధ్య చట్టం వర్తిస్తుందో లేదో పరిశీలించాలని పురంధేశ్వరి ఎన్నికల సంఘానికి సూచించారు. ఏటీఎం నుంచి మహిళ డబ్బులు తీసుకుంటున్నట్లు ఫొటోలతో పత్రికల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన భారీ ప్రకటనల క్లిప్పింగులను పురంధేశ్వరి తన వినతిపత్రానికి జత చేశారు.












Click it and Unblock the Notifications