తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి బాటలో నడిచిన ప్రముఖ కాంగ్రెస్ నాయకులు ఓటమిని రుచి చూస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సహా మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు. శాసనసభ స్పీకర్ కెఆర్ సురేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం విషయంలో ముఖ్యమంత్రి మాటే తన మాటగా పలుకుతూ వచ్చిన మంత్రి టి.జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ చేతిలో ఓడిపోయారు. మంత్రి షబ్బీర్ అలీ కూడా ఓటమిని చవి చూడక తప్పలేదు. కరీంనగర్ లోకసభ స్థానంలో మాజీ మంత్రి ఎం.సత్యానారాయణ రావు అనుచరుడు పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. పోటీకి దూరంగా ఉండి ముఖ్యమంత్రి తెలంగాణ వైఖరిని సత్యనారాయణరావు వీలు చిక్కినప్పుడల్లా వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణ నుంచి బలమైన కాంగ్రెసు నాయకులెవరూ గెలిచే పరిస్థితి లేదు.












Click it and Unblock the Notifications