వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిఎంకె, కాంగ్రెస్ చర్చలు కొలిక్కి

By Staff
|
Google Oneindia TeluguNews

Karunanidhi
న్యూఢిల్లీ‌: మంత్రి పదవులపై కాంగ్రెసు, డిఎంకెల మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన తొలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు పార్టీలకు ఆమోదయోగ్యమైన ఫార్ములా రూపొందినట్లు సమాచారం. డిఎంకెతో చర్చలు కొలిక్కి రాకపోవడంతో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ తో ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ వాయిదా పడింది. డిఎంకెకు రెండు కేబినెట్ హోదా పదవులను, ఇండిపెండెంట్ బాధ్యతలతో ఒక సహాయ మంత్రి పదవిని, మూడు సహాయ మంత్రి పదవులను ఇవ్వడానికి కాంగ్రెసు అంగీకరించినట్లు తెలుస్తోంది.

అయితే, మరో కేబినెట్ హోదా గల మంత్రి పదవి ఇవ్వాలని డిఎంకె ఇంకా పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెసు అందుకు సిద్ధంగా లేదు. ఎంకె అజగిరి, రనిమొజి, దయానిధి మారన్, హెలెన్ డేవిడ్ సన్ లకు డిఎంకె మంత్రి పదవులు ఇవ్వాలని డిఎంకె నేత కరుణానిధి పట్టుబడుతున్నారు. ఉపరితల రవాణా, రైల్వే, ఐటి, కమ్యూనికేషన్ల శాఖలను ఇవ్వాలని డిఎంకె అంటోంది. ఆర్జెడి నేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ను కూడా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X