రేపు 5.30కి మన్మోహన్ ప్రమాణం

76 ఏళ్ల ఆర్థిక శాస్త్రవేత్త ప్రధాని పదవిని చేపట్టడం ఇది రెండో సారి. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలిసి మంత్రులుగా ప్రమాణం చేసే సభ్యుల పేర్లను సమర్పిస్తారు. గురువారం ఉదయమే ఆయన రాష్ట్రపతిని కలవాల్సింది. అయితే మిత్రపక్షాలతో ముఖ్యంగా డిఎంకెతో మంత్రి పదవులపై ఒప్పందం కుదరకపోవడంతో ఆ భేటీ వాయిదా పడింది. మన్మోహన్ సింగ్ గురువారం సాయంత్రం రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. యుపిఎకు 322 సభ్యుల బలం ఉంది. యుపిఎకు తగిన మెజారిటీ ఉండడంతో పార్లమెంటు విశ్వాసం పొందాలని రాష్ట్రపతి ప్రధానిని ఆదేశించలేదు.












Click it and Unblock the Notifications