పురంధేశ్వరికీ మళ్లీ మంత్రి పదవి?

Purandeswari
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో మన రాష్ట్రానికి ఆరు లేదా ఏడు మంత్రి పదవులు దక్కడం ఖాయమని ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వీటిలో కనీసం రెండు కేబినేట్‌ పోస్టులు, రెండు లేదా మూడు స్వతంత్ర హోదా గల సహాయ మంత్రి పదవులు, మిగిలినవి సహాయ మంత్రి పదవులు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. పురంధేశ్వరికి, పల్లంరాజు, పనబాక లక్ష్మికి మంత్రి పదవులు ఖరారైనట్లు సమాచారం. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ గురువారం ఉదయం పదకొండున్నర గంటలకు జరుగుతుంది. ఇప్పటికే జైపాల్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి లభించింది. కాగా సాయిప్రతాప రెడ్డికి మంత్రి పదవు దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది. మంత్రి పదవులకు ఎంపిక చేసిన పార్లమెంటు సభ్యులు సెల్ ఫోనులు ఆఫ్ చేసి పెట్టుకోవాలని ఆదేశాలు వెళ్లాయి.

కాంగ్రెస్‌ పార్టీకి అత్యధికంగా 33 మంది సభ్యులను అందించిన మన రాష్ట్రం పట్ల సోనియా కూడా సానుకూల వైఖరితో ఉన్నట్లు పిసిసి వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా అరకు ఎం.పి. కిషోర్‌ చంద్రదేవ్‌కు స్పీకర్‌ పదవి లభించడం దాదాపు ఖాయ మైపోయింది. ఆయనకు అధిష్టానం నుంచి ప్రత్యేకంగా ఫోన్‌ రావడం ఈ ఊహగానాల్ని బలపరుస్తోంది. ఒకవేళ ఆయనకు స్పీకర్‌ పదవి లభించకపోతే కేబినేట్‌ పోస్టు ఖాయమని రూఢీ అవుతున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+