హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ 'వేడి' తెలిసొచ్చింది: చిరు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్‌: నిన్న అసెంబ్లీ "లొకేషన్" ను బాగా ఎంజాయ్ చేసిన చిరంజీవి నేడు వడగాడ్పులను చూశారు. మొదటిరోజు సభ చాలా ఆహ్లాదంగా ఉందని నిన్న విలేకరుల సమావేశంలో చెప్పానని కానీ రెండో రోజే సభ ఇంత వాడీ వేడిగా జరుగుతుందని అనుకోలేదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. స్పీకర్‌ ఎన్నికైనందుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డికి ప్రజారాజ్యం తరఫున శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రజా సమస్యలపై చర్చించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకునేందుకు ప్రజలు ఇక్కడకు పంపించారని అంతేగానీ అనవసరమైన విషయాలపై చర్చించడం సబబు కాదన్నారు. దీని వల్ల సభా సమయం, ప్రజాధనం వృధా అవుతుందని ఆయన తెలిపారు. ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారని అది గుర్తుంచుకుని సభలో ప్రవర్తించాలన్నారు. ఈ సారి సమావేశాలలో ప్రజా సమస్యలపై చర్చిండానికి ప్రతిపక్షాలకు ఎక్కువ సమయం కేటాయించాలని ఆయన స్పీకర్‌ ను కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X