హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విజయశాంతి కనబడుట లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

Vijayashanthi
హైదరాబాద్: మెదక్‌ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి కనబడుటలేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. మెదక్‌ పట్టణానికి చెందిన జీవన్‌ రావు, సంగ శ్రీకాంత్‌ లు సోమవారం మెదక్‌ సీఐ విజయ్‌ కుమార్‌ కు ఈ ఫిర్యాదు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాననీ, ప్రజల సమస్యలు తీరుస్తాననీ, అందుబాటులో ఉంటాననీ వాగ్దానాలు చేసి, ఓట్లు పొంది గెలిచిన తర్వాత ఆమె కనిపించడం లేదని ఫిర్యాదులో విమర్శించారు. లెక్కింపు తర్వాత గెలుపు ధ్రువీకరణ పత్రం తీసుకొనేందుకు కూడా విజయశాంతి రాలేదని వారన్నారు.

ఇదిలా ఉంటే విజయశాంతి హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో తమ పార్టీ అధినేత కె. చంద్రశేఖర రావును వెనకేసుకొచ్చారు. గెలిస్తే తమ సొంత కృషి అని ఓడిపోతే పార్టీ అధ్యక్షుడి వల్లేనంటూ నాయకత్వాన్ని విమర్శించడం మంచిదికాదని మెదక్‌ ఎంపీ, తెరాస రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి పార్టీ అసంతృప్త నేతలకు హితవు చెప్పారు. కేసీఆర్‌పై ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు తెలంగాణ ఉద్యమాన్ని ఈ స్థాయికి తెచ్చింది ఆయనేనన్న విషయాన్ని మరువరాదన్నారు. గతకొన్ని రోజులుగా తనను, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ వాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అందుబాటులో లేనంటూ కొందరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారనడంలో వాస్తవంలేదన్నారు. పార్లమెంటులో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి గతవారంలో 3, 4రోజులపాటు సభకు వెళ్లానని స్పష్టం చేశారు. గవర్నర్‌ ఉభయసభలను ఉద్దేశించి సోమవారం అసెంబ్లీలో చేసిన ప్రసంగంలో తెలంగాణ ఇస్తారో లేదో తేల్చిచెప్పకుండా నాన్చుడు వైఖరి అవలంభించడం ఎంతవరకు సమంజసమన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X