వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వైన్ ఫ్లూపై ఆందోళన వద్దు: ఆజాద్

By Staff
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ వ్యాధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ చెప్పారు. సైజును, జనాభాను బట్టి చూస్తే స్వైన్ ఫ్లూ రోగులు చాలా తక్కువ మందేనని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు.

వ్యాధి బయటపడిన రోజు నుంచే తాము చర్యలు చేపట్టామని ఆయన చెప్పారు. వ్యాధి వంద శాతం నయమవుతుందని ఆయన చెప్పారు. దేశంలో 15 కేసులు మాత్రమే నమోదయ్యాయని, ఇప్పటికే ఐదుగురు డిశ్చార్జీ అయ్యారని ఆయన చెప్పారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

అన్ని కేసులు కూడా అమెరికా నుంచి వచ్చినవారి నుంచే నమోదయ్యాయని, ఇది దేశంలో పుట్టింది కాదని ఆయన చెప్పారు. జిల్లా స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు. జాతీయ స్థాయిలో వైద్యులు, శాస్త్రవేత్తలతో ర్యాపిడ్ రెస్పాన్స్ టీం ఉందని, రాష్ట్రాల స్థాయిలో కూడా వాటిని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X