ఆ రేప్ చేసింది 10 మంది
నెల్లూరు: నెల్లూరులోని ఆత్మకూరు బస్సుస్టాండు వద్ద భర్తతో ఉన్న ఓ వివాహితను శనివారం అర్ధరాత్రి దాటాక 15 మంది కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 11.30 గంటలకు భార్యభర్తలిద్దరూ ఆత్మకూరు బస్సుస్టాండుకు వచ్చారు. ఆమెను బస్సుస్టాండు పక్కనే ఉంచి మద్యం తీసుకొచ్చేందుకని భర్త పక్కకు వెళ్లాడు. ఆటోలో వెళ్తున్న ఎనిమిదిమంది యువకులు ఆమెను బలవంతంగా ఎక్కించుకొని వెళ్లారు. అడ్డగించేందుకు ప్రయత్నించిన భర్త కిందపడి గాయపడ్డాడు. దుండగులు ఆమెను నగరంలోని పిల్లల పార్కు వద్దగల పొదల్లోకి తీసుకువెళ్లి ఫోను ద్వారా మరో ఏడుగురు స్నేహితులకు సమాచారమిచ్చి పిలిపించుకున్నారు. వారు మద్యం, బిరియానీ ప్యాకెట్లతో వచ్చారు. అంతా కలిసి మద్యం తాగి ఆమెపై ఆదివారం తెల్లవారుజాముదాకా అత్యాచారం చేశారు. ఆ తర్వాత వారిలో వారు ఘర్షణ పడుతుండగా భాదితురాలు తప్పించుకొంది.